బ్రెజిల్: పారా రాష్ట్రంలోని బెలెమ్ నగరంలో ఓ బార్లో ఆదివారం రాత్రి దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. అకస్మాత్తుగా బార్ లోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగలు పారిపోతుండగా, పోలీసులు వెంటాడారు. ఈ క్రమంలో ఓ దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. అయితే ఇది ఉగ్రదాడి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులకు దారి తీసిన కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మృతులు బెలెమ్ నగరంకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. శవ పరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.