వాషింగ్టన్: చైనాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ హువావెపై అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిషేధం వేటు వేశారు. టెలికాం కంపెనీలపై విదేశీ కంపెనీల దాడిని తిప్పి కొట్టేందుకు జాతీయ ఆర్థిక ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీని వల్ల విదేశీ కంపెనీల టెక్నాలజీ, సేవలు అమెరికన్ కంపెనీలు కొనుగోలు చేయడాన్ని నిషేధించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే ఏయే దేశాలు, కంపెనీలకు ఇది వర్తిస్తుందన్నది ప్రత్యేకంగా ప్రనస్తావించలేదు. అయితే అధికారులు ఇప్పటికే జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తున్న హువే నుంచి 5 జీ టెక్నాలజీలు కొనుగొలు చేయవద్దని టెలికాం కంపెనీలకు సూచించారు. ఈ ఉత్తర్వు వెలువడిన కొంత సమయంలోనే బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ ఒక ఉత్తర్వు జారీ చేస్తూ హువేను ఎంటిటీ లిస్ట్లో చేర్చుతున్నట్టు ప్రకటించింది.