అనుకుంది ఒక్కటి...అయ్యింది ఒక్కటి!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 12:28 PM

అనుకుంది ఒక్కటి...అయ్యింది ఒక్కటి!

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ క్రికెటర్ రిషబ్ పంత్ కలిసి మొటిమలను తగ్గించే ఫేస్ వాష్ ప్రకటనలో నటించారు. దీనికి సంభందించిన ఓ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ బ్రాడ్ హడ్జ్ స్పందించాడు. అమేజింగ్ వాట్ పీపుల్ డూ ఫర్ మనీ? అని ట్వీట్ చేశాడు. డబ్బుల కోసం ఏదైనా చేస్తారా? అని అర్థం వచ్చేలా బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు కోహ్లి ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అమేజింగ్.. వాట్ పీపుల్ డూ ఫర్ విన్నింగ్ అంటూ.. క్రికెట్ ఫ్యాన్స్ ఆసీస్ క్రికెటర్ల బాల్ ట్యాంపరింగ్ బాగోతాన్ని తవ్వడం మొదలు పెట్టారు. ఇక లాభం లేదనుకున్న హడ్జ్.. వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చాడు. కోహ్లి, పంత్ యాడ్ చేయడం తప్పు అని నేను అనలేదన్న హడ్జ్.. ‘నేను కూడా అలాగే చేసేవాణ్ని. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. సగం నీళ్లున్న గ్లాసులో నేను ఓ భాగాన్ని చూస్తుంటే మీరు మిగతా భాగాన్ని చూస్తున్నారు, మీరు వేరేలా అర్థం చేసుకున్నార’ని కవర్ చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లయిన స్టీవ్ స్మిత్, రహానే, బెన్ స్టోక్స్ కలిసి గతంలో నటించిన యాడ్ గురించి కూడా బ్రాడ్ హడ్జ్ ఇలాగే ట్వీట్ చేశాడు. కాగా 2005లో ఆసీస్ జట్టులోకి అడుగుపెట్టిన హాడ్జ్‌కి అన్ లక్కీ ప్లేయర్ అనే పేరుంది. జట్టులో విపరీతమైన పోటీ కారణంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించినప్పటికీ అప్పట్లో ఆసీస్ జట్టులో దిగ్గజ క్రికెటర్లు ఉండటంతో జాతీయ జట్టులో అతడికి అవకాశాలు అంతగా రాలేదు.






Untitled Document
Advertisements