క్యాన్సర్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన పాక్ క్రికెటర్ కూతురు

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 12:29 PM

క్యాన్సర్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన పాక్ క్రికెటర్ కూతురు

ఇస్లామాబాద్: పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ (27) కూతురు నూర్ ఫాతిమా (2) క్యాన్సర్ వ్యాధితో భాదపడుతూ ప్రాణాలు విడిచింది. స్టేజ్-4 క్యాన్సర్ తో ఫాతిమాలో అమెరికా లో ఓ ఆస్సత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్నీ పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రాంచైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ ట్విట్టర్ లో వెల్లడించింది. తన కుమార్తె క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతోందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థించాలని గత నెలలో ఆసిఫ్ తన ట్విట్టర్ లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆసిఫ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డేలో సిరీస్ లో పాక్ తరుఫున ఆసిఫ్ ఆడుతున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లాండ్ ఇప్పటికే 4-0 ముందంజలో ఉంది. తన కూతురు చనిపోయిందనగానే ఆసిఫ్ ఇంగ్లాండ్ నుంచి అమెరికా పయనమయ్యాడు. ఫాతిమా మృతిపై పాకిస్థాన్ ప్రజలు, క్రికెట్ అభిమానులు సంతాపం తెలపడంతో పాటు సానుభూతి ప్రకటించారు.





Untitled Document
Advertisements