ఎస్‌బీఐ ఏటీఎంలపై చార్జీల మోత!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 03:38 PM

ఎస్‌బీఐ ఏటీఎంలపై చార్జీల మోత!

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తన కస్టమర్లకు ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్ వీటికి కొంత మొత్తాన్ని కస్టమర్ల నుంచి వసూలు చేస్తోంది. ప్రతి నెలా కేవలం కొన్నిసార్లు మాత్రమే ఉచితంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోగలం. ఏటీఎం లొకేషన్ సహా వివిధ అంశాల ఆధారంగా నెలకు ఎన్ని సార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చనే అంశం ఆధారపడి ఉంటుంది. ఎస్‌బీఐ అలాగే డెబిట్ కార్డులను మంజూరు చేయడానికి, వాటి వార్షిక మెయింటెనెన్స్ కోసం కూడా ఖాతాదారుల నుంచి డబ్బుల్ని చార్జీల రూపంలో వసూలు చేస్తోంది. ఉదాహరణకు ప్లాటినం డెబిట్ కార్డు మంజూరుకు బ్యాంక్ రూ.306 తీసుకుంటోంది. ఎస్‌బీఐ ఏటీఎం లావాదేవీల చార్జీలు ఎలా ఉన్నాయో చూద్దాం.. బ్యాంక్ డెబిట్ కార్డు మంజూరు చేయడానికి కొంత చార్జ్ చేస్తుంది. గోల్డ్ డెబిట్ కార్డుకు రూ.100, ప్లాటినం డెబిట్ కార్డుకు రూ.306 తీసుకుంటుంది. అయితే సాధారణ క్లాసిక్/గ్లోబల్ కార్డు జారీకి ఎలాంటి చార్జీలు తీసుకోవడం లేదు. క్లాసిక్ డెటిక్ కార్డుకు వార్షిక మెయింటెనెన్స్ చార్జీ రూ.100. దీనికి సర్వీస్ ట్యాక్స్ అదనం. అలాగే సిల్వర్/గ్లోబల్/యువ/గోల్డ్ డెబిట్ కార్డులపై రూ.150 (సర్వీస్ ట్యాక్స్ అదనం) వసూలు చేస్తోంది. ప్లాటినం డెబిట్ కార్డుకు రూ.200, ప్రైడ్/ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డుకు రూ.300 తీసుకుంటోంది. వీటికి సర్వీస్ ట్యాక్స్ అదనం. డెబిట్ కార్డు రిప్లేస్‌మెంట్ కోసం రూ.204 వసూలు చేస్తోంది. డూప్లికేట్ పిన్ లేదా రిజెనరేషన్ పిన్ ‌కోసం రూ.51 చార్జ్ చేస్తోంది. దేశంలో డెటిట్ కార్డు లావాదేవీల చార్జీలను గమనిస్తే.. స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఏటీఎంలో లావాదేవీలకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఒక నెలలో 5 లావాదేవీలు ఉచితం. ఈ ఐదు లావాదేవీలు దాటితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.17, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.6 చార్జ్ చేస్తోంది.





Untitled Document
Advertisements