లండన్: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అధిల్ రషీద్ తన ఆటతీరుతో ఒక్కసారిగా టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు. లీడ్స్లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య ఐదో వన్డే జరిగింది. 351 పరుగులు లక్ష్యాన్ని పాక్ ముందు ఇంగ్లాండ్ ఉంచింది. 27 ఓవర్లలో క్రీజులో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్, బాబర్ ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్ జోస్ బట్లర్ వేసిన బంతిని సర్ఫరాజ్ లైగ్ సైడ్ కు బాదాడు. దీంతో బాబర్ క్రీజులో మధ్యలోకి వచ్చేశాడు. బట్లర్ బంతిని అందుకొని కీపర్ అదిల్ అందించాడు. కీపర్ అదిల్ బంతిని వెనక నుంచి వికెట్లపైకి విసిరాడు. దీంతో బంతి స్టంప్స్కు తాకింది. బంతిని ధోనిలాగానే వేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ 4-0 తో ముందంజలో ఉంది.