తజకిస్తాన్‌ జైలులో అల్లర్లు.....32 మంది మృతి

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 04:04 PM

తజకిస్తాన్‌ జైలులో అల్లర్లు.....32 మంది మృతి

తజకిస్తాన్‌: తజకిస్తాన్‌ జైలులో అల్లర్లు జరిగాయి. అయితే ఈ అల్లర్లలో 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల ప్రకారం. రాజ‌ధాని దుషాన్బేకు 25 కిలోమీట‌ర్ల దూరంలో వాహ‌ద‌త్ ఉంది. మే 19వ తేదీన జైలులో ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. సుమారు అర‌గంట పాటు కాల్పుల శ‌బ్ధాలు వినిపించిన‌ట్లు ఖైదీల‌కు చెందిన కుటుంబీకులు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఖైదీలు ముగ్గురు సెక్యూర్టీ గార్డుల‌ను కూడా చంపేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉంది.మృతిచెందిన‌వారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు.





Untitled Document
Advertisements