టెక్సాస్కు చెందిన ములేషియా బుకర్(23) అనే ట్రాన్స్జెండర్ డాలస్లో జరిగిన కాల్పులలో మరణించింది. ములేషియా గత నెల 12న చిన్న ట్రాఫిక్ యాక్సిడెంట్ చేయడంతో ఓ వ్యక్తి ఆమెను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దాడి చేశాడు. ఆ ఘటనను వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ దాడి జరిగిన నెల రోజుల తరువాత ములేషియా మరణించడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆమె చనిపోయిన చోట నిందితులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ యాక్సిడెంట్ ఘటనలో ఆమెపై దాడి చేసిన వ్యక్తి వేరొకరి నుంచి 200 డాలర్ల సుపారీ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను తమ అదుపులోనే ఉన్నట్టు పోలీసులు చెప్పారు.