నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తేలేదు!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 11:46 AM

నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తేలేదు!

భువనేశ్వర్: తానూ ఓ లెస్బియన్ అని మరో అమ్మాయితో సంభందం ఉందని సంచలన ప్రకటన చేసిన భారత స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, దీనిపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. అయితే ద్యుతీచంద్ ప్రకటనపై ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. బిడ్డ వరుస అయ్యే అమ్మాయితో సహజీవనం ఏంటని ద్యుతీ తల్లి అఖోజి చంద్ ప్రశ్నించారు. మరోవైపు ద్యుతీని భయపెట్టి, బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే అలా మాట్లాడుతుందని ఆమె సోదరి సరస్వతి సంద్ మీడియాతో వాపోయిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ద్యుతీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోయిన ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరు బ్లాక్‌మెయిల్ చేయలేదని, తన అక్కనే పలుసార్లు వేధింపులకు గురి చేసిందని ఆరోపించింది. తన అక్క రూ.25 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తేస్తుందని తెలిపింది. తన సహజీవనం గురించి అక్కకు తెలుసని, దీన్ని అసరగా చేసుకుని తనను బ్లాక్‌మెయిల్ చేస్తుందని ద్యుతీ పేర్కొంది. ఈ విషయంలో తన అక్కపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ద్యుతీ గుర్తు చేసింది. చాలా కాలంగా తనను ఆమెను వేధింపులకు గురి చేస్తుందని, దాన్ని తట్టుకోలేక విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చిందని చెప్పింది. ఇక, తాను సహజీవనం చేస్తున్న అమ్మాయి తన గ్రామంలోనే ఉంటుందని, ఆమెతోనే కలిసి మిగత జీవితాన్ని గడుపుతానని స్పష్టం చేసింది. ఇది తన వ్యక్తిగత విషయమని, దీనిలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ద్యుతీ పేర్కొంది.





Untitled Document
Advertisements