బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాపై నెటిజన్ల ఆగ్రహం

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:13 PM

బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాపై నెటిజన్ల ఆగ్రహం

బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా, ఇప్పుడు నెటిజన్ల తిట్ల వర్షంలో తడుస్తోంది. ఆమె చేసిన ఓ పనిని ట్రోలర్స్ తప్పుపడుతూ దెప్పిపొడుస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేదార్ నాథ్ ను సందర్శించిన వేళ, అక్కడి మానవ నిర్మిత కృత్రిమ గుహలో 17 గంటల పాటు గడిపి, ధ్యానం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలను బీజేపీ బయటకు విడుదల చేయగా, అవి వైరల్ అయ్యాయి.

ఇక ట్వింకిల్ ఖన్నా, నరేంద్ర మోదీ కూర్చున్న పోజులోనే కూర్చుని ఫోటోలు తీయించుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టింది. అంతవరకూ బాగానే ఉంది. ఇటీవలి కాలంలో తాను ఎన్నో స్పిరిచ్యువల్ ఇమేజస్ ను చూశానని, తాను కూడా మెడిటేషన్ - ఫోటోగ్రఫీ - పోజులివ్వడంపై ఓ వర్క్ షాప్ ను నిర్వహించాలని అనుకుంటున్నానని, అందులో చేరాలని అనుకునేవారు ముందుకు రావాలని క్యాప్షన్ పెట్టింది.

ట్వింకిల్ ఖన్నా మోదీని అనుకరించడం, ఆమె వేసుకున్న డ్రస్ అభ్యంతరకరంగా ఉండటం, ధ్యానముద్రలో కూర్చుని సన్ గ్లాసెస్ పెట్టుకుని నవ్వుతుండటం, ముందే చెప్పులు పెట్టుకోవడం తదితరాలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.





Untitled Document
Advertisements