సార్వత్రిక ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రసారభారతి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారి గూగుల్తో ప్రత్యేక ఒప్పందం చేసుకుని యూట్యూబ్ ద్వారా నిరంతరాయంగా ప్రసారాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం యూట్యూబ్ వెబ్సైట్ లేదా యాప్లోని టాప్ స్క్రీన్లో డీడీ న్యూస్ కోసం ప్రత్యేక స్ట్రీమ్ను ఏర్పాటు చేస్తోంది. ఈ స్ట్రీమ్పై క్లిక్ చేయగానే డీడీ న్యూస్ లైవ్ యూట్యూబ్ చానల్ వస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో 14 భాషల్లో లైవ్ స్ట్రీమ్లు ఉంటాయని, వీక్షకులు తమకు అవసరమైన దాన్ని ఎంచుకోవచ్చని చెప్పారు. కచ్చితమైన ఫలితాలను మాత్రమే ప్రసారం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.