మరో నాలుగు బ్యాంకుల విలీనం!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:39 PM

మరో నాలుగు బ్యాంకుల విలీనం!

న్యూఢిల్లీ: ప్రస్తుతం అన్ని బ్యాంకింగ్ సంస్థల్లో విలీన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే అలహాబాద్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్‌లు కూడా పీఎన్‌బీ చేతికి వెళ్లొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బలహీన బ్యాంకులను బలమైన బ్యాంకులతో విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎన్‌బీలో మిగతా మూడు బ్యాంకులను కలిపేసే అవకాశముంది. వచ్చే మూడు నెలల కాలంలో వీలిన ప్రక్రియకు సంబంధించిన చర్చలను పీఎన్‌బీ ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకుల విలీనంపై ఇప్పటివరకు ఏ బ్యాంక్ కూడా స్పందించలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇకపోతే ఇటీవల కాలంలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు విలీనమైన విషయం తెలిసిందే. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోనే రెండో అదిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా ఆవిర్భవించింది. ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది. దీని కన్నా ముందు ఎల్ఐసీ.. ఐడీబీఐ బ్యాంక్‌ను టేకోవర్ చేసింది.





Untitled Document
Advertisements