దేశీయ ఇంధన ధరలు బుధవారం నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.75.48 వద్ద, డీజిల్ ధర రూ.71.99 వద్ద స్థిరంగానే కొనసాగింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.71.17 వద్దే ఉండగా డీజిల్ ధర రూ.66.20 వద్ద నిలకడగా కొనసాగింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పెట్రోల్ ధర రూ.76.78 వద్ద.. డీజిల్ ధర రూ.69.36 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.75.24 వద్ద, డీజిల్ ధర రూ.71.36 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.74.89 వద్ద.. డీజిల్ ధర రూ.71.03 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.44 శాతం క్షీణతతో 71.86 డాలర్లకు తగ్గింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.86 శాతం తగ్గుదలతో 62.59 డాలర్లకు దిగొచ్చింది.