ఇంగ్లాండ్‌కు పయనమైన టీమిండియా

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:43 PM

ఇంగ్లాండ్‌కు పయనమైన టీమిండియా

ముంబై: త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ టోర్నీ కోసం టీమిండియా జట్టు లండన్‌కు పయనమైంది. బుధవారం తెల్లవారుఝామున ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి కోహ్లిసేన ఇంగ్లాండ్‌కు పయనమైంది. ఈ సందర్భంగా కోహ్లి, ధోని సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫోటోలను బిసిసిఐ ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్‌, హార్థిక్‌ పాండ్యా కూడా ఫోటోలు ట్వీట్‌ చేశారు. మొదటగా జూన్‌5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో భారత్‌ తన ప్రయాణం మొదటుపెట్టనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో కోహ్లిసేన రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లాండ్‌ బయలుదేరే ముందు కోహ్లి, రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా ఇది తనకు అత్యంత సవాలుతో కూడుకున్న ప్రపంచకప్‌ అనిపిస్తుంది. ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వచ్చు, ఫార్మాట్‌ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్‌, దీనికి ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకం అని కోహ్లి అన్నారు.





Untitled Document
Advertisements