న్యూఢిల్లీ: అక్టోబరు 22న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్(బిసిసిఐ) సంఘానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సిఓఏ) ప్రకటించారు. సుప్రీం కోర్టు నియమించిన సిఓఐ ఆధ్వర్యంలోనే క్రికెట్ బోర్డు నిర్వహణ జరుగుతున్నది. దానికి ప్రస్తుతం వినోద్ రాయ్ చీఫ్గా ఉన్నారు. డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ జనరల్ రవి తోగ్డేలు సభ్యులుగా ఉన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సభ్యులతో బిసిసిఐ బోర్డు నిర్వహణ జరుగుతుందన్న నమ్మకాన్ని నర్సింహా కమిటీ వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో చర్చలు జరిగిన తర్వాత నర్సింహా తన రిపోర్ట్ను సమర్పించారు.