ప్రాణాంతక ఊపిరితిత్తుల (లంగ్) కేన్సర్ను నిపుణుల కంటే పక్కాగా నిర్ధారించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వ్యవస్థను గూగుల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చునని చెబుతున్నారు. లో డోస్ చెస్ట్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (ఎల్డీసీటీ) స్కానింగ్ ద్వారా కేన్సర్ బుడిపెలను గుర్తించడమే కాకుండా.. ఏఐ విధానంలో వ్యాధి తీవ్రతను కూడా సులువుగా అర్థం చేసుకోవచ్చునని వివరిస్తున్నారు. ఈ వివరాలను నేచర్ మెడిసిన్ అనే జర్నల్లో ప్రచురించారు. ఈ విధానంలో కేన్సర్ను ముందుగానే గుర్తించే వీలు కూడా ఉందన్నారు.