11మంది విజేతలకు వరల్డ్‌కప్‌ వీక్షించే అవకాశం

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 01:39 PM

11మంది విజేతలకు వరల్డ్‌కప్‌ వీక్షించే అవకాశం

భారత్‌ పేకు చెందిన 11మంది షాప్‌కీపర్‌లు ఇంగ్లండ్‌లో జరుగనున్న వరల్డ్‌కప్‌ను తిలకించే అదృష్టం దక్కనుంది. భారత్‌ పే క్యూఆర్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసినందుకుగాను మొత్తం రూ.55లక్షల బహుమతులను ఖాతాదారులు అందుకున్నారు. వీరిలో 1364 మందిలో 44మందికి థాయ్‌ల్యాండ్‌ పర్యటన అవకాశం, 55 మందికి ఎల్‌ఈడీ టీవీలు, స్మార్ట్‌ ఫోన్‌లు బహుమతిగా లభించాయి.

11మంది అదృష్ట విజేతలకు జులై 2న ఇంగ్లండ్‌ పర్యటన అదృష్టం దక్కింది. ఆ రోజు భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే పోటీని బర్మింగ్‌హ్యామ్‌లోని క్రికెట్‌ మైదానంలో వీరు తిలకించనున్నారు. సల్మాన్‌ఖాన్‌ రాయబారిగా ఉన్న భారత్‌పే సంస్థ హైదరాబాద్‌, పూనె, ఢిల్లీ, ముంబైలలో వినియోగదారులనుంచి అదృష్ట విజేతలను ఎంపిక చేసింది. అదృష్ట విజేతలకు ముంబైలో జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందచేశారు. ఈ మేరకు సంస్థ బెంగళూరులో ఒక ప్రకటన విడుదల చేసింది.





Untitled Document
Advertisements