ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్...

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 03:47 PM

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్...

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం అదనపు డేటా సేవలను అందిస్తోంది. ఈ మేరకు తన మూడు ప్లాన్లను సవరించింది. ప్రిపెయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కంపెనీ రూ.399, రూ.448, రూ.499 ప్లాన్లను సవరించింది. ఈ ప్లాన్లపై మరింత డేటా అందిస్తోంది. ప్రతి ప్లాన్‌పై 400 ఎంబీ డేటాను రోజూ అదనంగా పొందొచ్చు. సవరించిన ప్లాన్ల ప్రకారం.. రూ.399 ప్లాన్ రోజుకు 1.4 జీబీ డేటాను, రూ.448 ప్లాన్ రోజుకు 1.9 జీబీ డేటాను, రూ.499 ప్లాన్ రోజుకు 2.4 జీబీ డేటాను అందిస్తోంది. రూ.399 ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.448 ప్లాన్ వాలిడిటీ 82 రోజులు. రూ.499 ప్లాన్ వాలిడిటీ కూడా 82 రోజులుగానే ఉంది. ఈ ప్లాన్లపై అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఏడాది నార్టన్ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తోంది. ఇకపోతే కంపెనీ ఇటీవలే తన రూ.129, రూ.249 ప్లాన్లను కూడా సవరించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్లపై లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తోంది. సవరించిన ప్లాన్ల వివరాలు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో ఇంకా అప్‌డేట్ కాలేదు.





Untitled Document
Advertisements