ముంబై: వరల్డ్ కప్ టోర్నీపై భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తాజాగా స్పందించారు. ఈ ప్రపంచకప్లో బౌలర్లు చెమట చిందించే దానిపై కప్పు గెలవడం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నంబర్ వన్గా ఉన్న బుమ్రాతో పాటు షమీ, భువనేశ్వర్లతో పాటు హార్ధిక్ పాండ్య సైతం వేగంగా బంతులు వేయడంతో పాటు బంతిని స్వింగ్ చేయగలరు. ఐతే ఇంగ్లాండ్లోని పరిస్థితులకు తగ్గట్టుగా తమ బౌలింగ్లో మార్పుటు చేసుకుంటేనే మంచి ఫలితం రాబట్టవచ్చు. బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ, ధావన్ ,కోహ్లితో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. మిడిలార్డర్లో ధోనితో పాటు కేదార్ జాదవ్ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.