10 క్వింటాళ్లకు పైగా లడ్డూలు ఆర్డర్ చేసిన నేతలు

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:08 PM

10 క్వింటాళ్లకు పైగా లడ్డూలు ఆర్డర్ చేసిన నేతలు

లోక్‌సభ ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నవారు.. విజయోత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాణాసంచా తెచ్చుకోవడంతో పాటు, స్వీట్లకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నారు. పంజాబ్‌లో అయితే వివిధ రాజకీయ పార్టీల నాయకులు 10 నుంచి 12 క్వింటాళ్ల లడ్డూలు ఆర్డర్ చేశారట. వీరిలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఉన్నారట. గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో నేతలు ఉన్నారని.. దీంతో తమకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇస్తున్నారని దుకాణదారులు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాతే.. నేతలు మరింత ఉత్సాహంగా కనపడుతున్నారని చెబుతున్నారు.





Untitled Document
Advertisements