పరువు నష్టం కేసు....వెనక్కి తగ్గిన అనిల్ అంబానీ

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:44 PM

పరువు నష్టం కేసు....వెనక్కి తగ్గిన అనిల్ అంబానీ

ముంబై: రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీ కాంగ్రెస్ నేతలతో పాటు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలపై సుమారు 5వేల కోట్లు విలువైన పరువు నష్టం కేసును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని అనిల్‌ అంబానీ నిర్ణయించారు. రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలులో అనిల్‌ అంబానీకి మోది సాయం చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న, అనిల్‌ ,,కాంగ్రెస్‌ నేత రాహుల్‌తో పాటు నేషనల్‌ హెరాల్డ్‌పై పరువునష్టం కేసు వేశారు. అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టులో ఆ దావాలు దాఖలయ్యాయి. దావాలను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయవాది రాశేష్‌ పారిక్‌ ఇవాళ మీడియాతో తెలిపారు.





Untitled Document
Advertisements