మొగదిషులో కారు బాంబు పేలుడు...ఇద్దరు మృతి

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:52 PM

మొగదిషులో కారు బాంబు పేలుడు...ఇద్దరు మృతి

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో బుధవారం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఈ దాడి అధ్యక్షభవనానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు కాన్వాయ్‌ ను లక్ష్యంగా చేసుకొని పాల్పడినట్లు ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ అల్‌ షబాబ్‌ ప్రకటించింది. ఈ పేలుళ్లలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించామని వైద్య విభాగం ఉన్నతాధికారి అబ్ధి ఖాదిర్ అబ్ధి రహమాన్ తెలిపారు.దాల్జిక్రాకు సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద ఈ పేలుల్లు జరిగాయి. అయితే ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.





Untitled Document
Advertisements