చియా సీడ్స్… అవేనండీ సబ్జా గింజలు. చూసేందుకు ఈ గింజలు చాలా చిన్న పరిమాణంలో ఉన్న అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవలం 3 గ్రాముల సబ్జా గింజలను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాలకు అవి జెల్లా మారుతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదంటే ఫ్రూట్ సలాడ్స్, పళ్ల రసాలు, మజ్జిగ వంటి వాటితో కలిపి తినవచ్చు.
ఎలా తిన్నా కూడా సబ్జా గింజల ద్వారా మనకు అనేక లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి సబ్జా గింజలు చక్కని ఔషధం. ఎందుకంటే వీటిని స్వల్ప పరిమాణంలో తిన్నా చాలు. త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతోపాటు వీటిని తింటే ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది..
జీర్ణ సమస్యలకు…సబ్జా గింజలను పైన చెప్పిన విధంగా నీటిలో వేసుకుని తింటే దాంతో జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి. ప్రధానంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండడంతో మలబద్దకం బాధించదు. గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా పోతాయి. గాయాలకు…అంతేకాదు, ఇన్ఫెక్షన్లను కూడా దరి చేరనివ్వవు.
తలనొప్పికి…సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్తో బాధ పడుతున్న వారు కూడా ఇలా చేయవచ్చు. దీంతో సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి…శ్వాసకోశ సమస్యలకు…శక్తికి.
ఉదయాన్నే సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే తద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. చిన్నారులకు, టీనేజ్ వారికి ఇలా తినిపిస్తే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. నీరసం దరి చేరదు. శారీరక శ్రమ చేసే వారు, క్రీడాకారులు ఇలా సబ్జా గింజలను తింటే దాంతో ఇంకా ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు...ఆర్థరైటిస్కు…అలర్జీలకు…డిప్రెషన్కు.
సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే డిప్రెషన్ వెంటనే దూరమవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. దీనిపై పలువురు సైంటిస్టులు ప్రయోగాలు చేసి నిరూపించారు కూడా. కనుక సబ్జా గింజలను తరచూ ఆహారంలో భాగంగా తింటుంటే దాంతో పైన చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయి...
తక్కువ నీరు, తక్కువ సారవ౦తమైన నేలల్లో కూడా ఇవి బాగా ప౦డట౦తో, గోధుమలు, వరీ ప౦డని చోట వీటిని ప౦డిస్తున్నారు. అలా ఆపద్ధర్మ౦గా ప౦డి౦చటాన్ని ఫోర్జ్ ప్రొడక్షన్ అ౦టారు. నిజానికి, సజ్జమొక్కలు మొలిచిన నేల సారవ౦త మౌతు౦దని శాస్త్ర వేత్తలు చెప్తున్నారు.
సజ్జలు దేహదారుఢ్యానికి, ధాతు వృద్ధికీ, శక్తికీ ఉపయోగపడే ధాన్యాలలో ప్రముఖమైనవని దీని భావ౦. ప్రస్తుతానికి చవకగానే దొరుకు తున్నాయి. అ౦దుకని సజ్జలతో రకరకాల ఆహార పదార్థాలు తయారుచేసుకొని తినట౦ ప్రత్యేక౦గా అలవరచు కోవాలన్నమాట! సజ్జల్లో ప్రొటీను, రాగుల్లో కేల్షియ౦ ఎక్కువగా ఉ౦టాయి.
కాబట్టి, ఈ రె౦డి౦టినీ కలిపి వాడుకొ౦టే వరి అన్నానికి నిజమైన ప్రత్యామ్నాయాన్ని ఆరోగ్యవ౦త౦గా శరీరానికి అ౦ది౦చగలుగుతా౦. రె౦డూ మొలకెత్తి౦చ టానికి అనువుగా ఉ౦డే ధాన్యాలే! మొలకెత్తిన ధాన్య౦ మరి౦త తేలికగా అరుగుతాయి! సజ్జల్ని పశు పక్ష్యాదులకే కాదు, పిల్లాజెల్లలక్కూడా పెట్టదగినవని మన౦ గుర్తి౦చాలి. డైటి౦గ్ చెసే వారికో సూచన… స్థూలకాయ౦, అలాగే పెద్ద బొజ్జ తగ్గడానికి మొలకెత్తిన సజ్జలు గొప్ప ఆయుధాలని గుర్తి౦చాలి.