దేశరాజకీయ చరిత్రలోనే సుదీర్ఘమైన పాదయాత్రతో, దీక్షలు ధర్నాలతో.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ తొలిరౌండ్ లో వైయస్ఆర్ సీపీ 147 స్థానాలకు పైగా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. వైయస్సార్ మీద అభిమానంతో… జగన్ పాదయాత్రతో జనంలోకి వెళ్లిన విధానం.. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని నవరత్నాల రూపంలో ఆకర్షణీయమైన పధకాలను రూపొందించడం వంటి అంశాలు జగన్ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తొలి రౌండ్ కౌంటింగ్లో ఓ దశలో ఏకంగా బాబుతో సహా లోకేష్ మరియు మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా జగన్ ప్రభంజనం దెబ్బకి వెనుకంజలో పడ్డారు.