ఫ్యాన్‌ జోరుకు టీడీపీ కుదేలు

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:24 AM

ఫ్యాన్‌ జోరుకు టీడీపీ కుదేలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈరోజు ఏపీ వ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతుంది. అంతా భావించినట్లుగానే... ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజం కాబోతున్నాయి. ఫ్యాన్‌ జోరుగా ఎంతో షికారుగా ముందుకు దూసుకు పోతుంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేవ్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

అదేవిధంగా ఫ్యాన్‌ జోరుకు అధికార టీడీపీ కుదేలైంది. మహామహులైన మంత్రులు సైతం ఫ్యాన్ జోరుకు కొట్టుకుపోతున్నారు. మంగలగిరి టీడీపీ అభ్యర్థి లోకేశ్ నారా కూడా ముందంజ వెనుకంజలతో తారుమారు అవుతున్నారు. అధిక వత్తిడికి గురౌతున్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 137 సీట్ల ఆధిక్యంలో నిలవగా.. టీడీపీ మాత్రం 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎప్పుడూ హడావుడిగా ఉండే చంద్రబాబు నివాసం వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో బోసిపోతున్నట్లు తెలుస్తోంది. ఇది తెలుగు తమ్ముళ్లను కలవరానికి గురిచేసే అంశంగానే భావించవచ్చు.

కాగా ఫలితం వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా ఉండటంతో పార్టీ కార్యాలయంలో అభిమానులు కేరింతలు హడావుడి ఎక్కువైంది. ఒకానొక దశలో చంద్రబాబు సైతం వెనుకంజలో నిలవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.





Untitled Document
Advertisements