మళ్ళీ పెరిగిన ఇంధన ధరలు

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:57 AM

మళ్ళీ పెరిగిన ఇంధన ధరలు

న్యూఢిల్లీ: దేశీయ ఇంధన ధరలు గురువారం 9 పైసలు చొప్పున పైకి కదిలాయి. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.75.57కు, డీజిల్ ధర రూ.72.09కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.71.25కు చేరింది. డీజిల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.66.29కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 10 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ రూ.76.86కు.. డీజిల్ ధర రూ.69.46కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే పెరిగాయి. పెట్రోల్‌ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.75.33కు, డీజిల్‌ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.71.46కు చేరింది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.74.98కు.. డీజిల్ ధర రూ.71.13కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.59 శాతం క్షీణతతో 70.57 డాలర్లకు తగ్గింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.62 శాతం తగ్గుదలతో 61.04 డాలర్లకు దిగొచ్చింది.





Untitled Document
Advertisements