టీమిండియానే ఫేవరెట్‌!

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:04 PM

టీమిండియానే ఫేవరెట్‌!

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ప్రపంచకప్ టోర్నీలో తమ ఫేవరెట్‌ జట్టు గురించి బయటపెట్టింది. హైదరాబాద్‌లో బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో ప్రపంచకప్‌పై మిథాలీ తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ మేరకు తనకు ఎక్కువ మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్న టీమిండియానే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ అని తెలిపింది. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ... 'కెప్టెన్ విరాట్‌ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తాడు. అతనికి ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌లు మంచి సహకారం అందిస్తారు. జస్ప్రీత్‌ బుమ్రా లాంటి పేసర్, మంచి స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. బ్యాట్స్‌మన్‌ భారీ స్కోర్లు చేస్తే.. ప్రత్యర్థిని పరుగులు చేయకుండా అడ్డుకున్న బౌలర్ల జట్టే మ్యాచ్‌లు గెలుస్తుంది. ఇందులో భారత జట్టు బాగుంది. ధోనీ రూపంలో సీనియర్ ఆటగాడు ఉన్నాడు. ఏ ఒక్క ఆటగాడి గురించో చెప్పడం కష్టం. టీమిండియాలో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు' అని మిథాలీ అన్నారు.'ఐపీఎల్‌ ద్వారా అన్ని జట్లు, ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు. అందరూ ప్రపంచకప్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. వారందరూ కచ్చితంగా రాణిస్తారు. ప్రపంచకప్‌లో భారత్‌ ఫేవరెట్‌. ఎందుకంటే గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియా రాణిస్తోంది. ఇంగ్లాండ్‌కు కూడా కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో 10-15 వరుస విజయాలు అందుకుంది. సొంత గడ్డపై ఆడడం కలిసొచ్చే అంశం. అయితే ఒక భారతీయురాలిగా నా మద్దుతు భారత్‌కే' అని మిథాలీ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements