సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మొత్తం 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందుంజలో ఉన్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాల్లో మునిగిపోయారు.
అదేవిధంగా ఈ విజయాన్ని ఉండవల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయానందంతో విజయసాయిరెడ్డితో వైఎస్ జగన్ తమ సంతోషాన్ని పంచుకున్నారు.