ఆంధ్ర ప్రదేశ్ లో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమైంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ 150 సీట్లలో లీడ్లో ఉంది. టీడీపీ 24 సీట్లకే పరిమితమయింది.. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తో కలిసి అతికష్టం మీద టీడీపీ గెలిచింది .. దానికి తోడు జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండడంతో టీడీపీ విజయ దుందుభి మోగించింది .. అయితే ఇక్కడ విషయం ఏంటంటే .. టీడీపీ సొంతంగా గవర్నమెంట్ ఫార్మ్ చేయలేదా అన్న డౌట్ అందరికి ఆలోచన వస్తుంది .. స్పెషల్ కేటగిరీ విషయంలో బీజేపీ తో పొత్తుకు ఎండ్ చెపుతూ సొంతంగా బరిలోకి దిగి భారీ అపజయాన్ని మూట కట్టుకుంది .. రానున్న కాలంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి ..