ఇవాళ అమ్మ ఇండియాకు తిరిగి వెళ్తూ ఫ్రీడ్జ్‌పై నా కోసం వదిలి వెళ్లిన నోట్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:09 PM

ఇవాళ అమ్మ ఇండియాకు తిరిగి వెళ్తూ ఫ్రీడ్జ్‌పై నా కోసం వదిలి వెళ్లిన నోట్

ఇండో-కెనడియన్ అయిన శృతి నాయక్ అనే యువతి తన తల్లి రాసిన ఓ చిటీని ట్విట్టర్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయింది. ఈ పోస్టుపై విదేశాల్లో ఉంటున్న భారత ప్రవాసీయులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. అమ్మ తిరిగి స్వదేశానికి బయల్దేరే సమయంలో రాసిపెట్టిన చిటీని శ‌ృతి ఫొటో తీసి ట్విట్టర్ పోస్టు చేసింది. 'ఇవాళ అమ్మ ఇండియాకు తిరిగి వెళ్తూ ఫ్రీడ్జ్‌పై నా కోసం వదిలి వెళ్లిన నోట్ ఇది' అని శృతి రాసుకొచ్చింది.

ఇంతకు చిటీలో ఏముందో చెప్పలేదు కదూ. అది పూర్తిగా ఆహార పదార్థాల చిట్టా. రిఫ్రిజిరేటర్లో ఎక్కడ ఏ ఆహార పదార్థం పెట్టిందో తన కూతురు వెతుక్కొకుండా సులువుగా తీసుకునే కంప్లీట్ ఫుడ్ నోట్‌ను ఆ తల్లి రాసిపెట్టింది. ఫ్రీడ్జ్‌లోనే కాకుండా ఇంట్లో కూడా ఎక్కడెక్కడ ఆహార పదర్థాలు దాచి పెట్టిందో ఈ చిటీలో పేర్కొంది. పాలు నుంచి పప్పు వరకు ఏది వదిలిపెట్టకుండా అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో వివరంగా రాసిపెట్టింది. ఈ చిటీ ప్రస్తుతం ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తుండగా, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.





Untitled Document
Advertisements