ఆరు నెలల పసికందు ఉన్నట్టుండి విమానంలో తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో పైలట్ మానవత్వంతో వెంటనే ఫ్లైట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి బిడ్డ ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన లండన్ నుంచి రియాధ్ వెళ్తున్న సౌదీ ఎయిర్లైన్స్లో మంగళవారం చోటుచేసుకుంది. బిడ్డకు శ్వాసతీసుకోవడం కష్టంగా మారడంతో వెంటనే పైలట్ కైరో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి తీసుకున్నాడు. దాంతో అప్పటికే వైద్యులు అక్కడికి చేరుకొని పసికందుకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం చికిత్స కోసం ఎయిర్పోర్ట్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.