గిన్నిస్ రికార్డులోకి ఇఫ్తార్ విందు!

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:17 PM

గిన్నిస్ రికార్డులోకి ఇఫ్తార్ విందు!

దుబాయ్: అబుదాబిలో భారత్‌కు చెందిన ఓ చారిటీ సంస్థ గిన్నిస్ ప్రపం చ రికార్డు సృష్టించింది. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాసం తర్వాత ఇచ్చే ఇఫ్తార్ విందులో ఈ రికార్డు నెలకొల్పారు. అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు నడిపిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవు న ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఈ ఘనతను సాధించినట్టు గల్ఫ్‌న్యూస్ శనివారం పేర్కొంది. శాఖాహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా, దీన్ని భుజించడం వల్ల జంతువధను అరికట్టవచ్చు. ఈ రికార్డు సాధించడంలో సాయపడిన అందరికీ కృతజ్ఞతలు అని చారిటీ వ్యవస్థాపకుడు జోగిందర్ సింగ్ సలారియా తెలిపారు.





Untitled Document
Advertisements