మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన అనిల్ ఫిరోజియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బాబూలాల్ మాలవీయ్ కన్నా అనిల్ 2,10,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో బాబూలాల్ మాలవీయ్ తన ఓటమిని అంగీకరిస్తూ, ఎన్నికల కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు బీజేపీ విజయం ఖాయమండంతో ఆ పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని పరస్పరం కరచాలనం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. బీజీపీ విజయబావుటా ఎగురవేసిన నేపధ్యంలో మాజీ మంత్రి పరాస్ జైన్ పార్టీ కార్యాలయంలో డోలు వాయించారు.