ఎన్నికల ఫలితాలు చూసిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శీహోర్ జిల్లాలో వెలుగుచూసింది. శీహోర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రతన్సింగ్ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో వెలువడుతున్న ఫలితాలను చూసిన రతన్ సింగ్ గుండెపోటుతో మరణించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడం చూసిన రతన్ సింగ్ ఆవేదనతో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు అతని మృతదేహాన్ని ఇంటికి తరలించి, నివాళులు అర్పించారు.