వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. 23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది అధికారులు ఈరోజు ఉదయం ఆయనను తాడేపల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వివరాలను వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారులు వివరించారు. ఈ నెల 30వ తేదీన జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. దీంతో జగన్కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా పెంచారు.
అదేవిధంగా మరోవైపు జగన్ను కలిసి అభినందించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. దీంతో తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని పూర్తిగా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అక్కడి వాతావరణం చాలా కోలాహలంగా మారింది.