రాష్ట్రంలో మరో ఐదురోజులు వడగాలులు వీస్తాయంటోంది వాతావరణశాఖ. వడగాలులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ అధికారులు. రాష్ట్రంలో 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఒకటి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణలో వడగాలులు.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు