సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. అయితే గత ప్రభుత్వంలో నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అరుణ్జైట్లు మరోసారి ఆ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేరనే విషయం విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. అధిక ఒత్తిడితో కూడిన బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ కార్యలయం వద్ద గురువారం రాత్రి ఆ పార్టీ నేతలు నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో కూడా అరుణ్జైట్లీ కనిపించకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ పేరును ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.