ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమౌతోంది. దీని పేరు గెలాక్సీ ఏ70ఎస్. ప్రస్తుతం నడుస్తోన్న 48 ఎంపీ కెమెరా ట్రెండ్కు బదులు శాంసంగ్ కంపెనీ తన కొత్త ఫోన్లో ఇంకా ఎక్కువ మెగా పిక్సెల్ ఉన్న కెమెరాను అమర్చే అవకాశముంది. శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ ఫోన్లో 64 ఎంపీ కెమెరా ఫీచర్ ఉండే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే కనుక నిజమైతే ప్రపంచంలో 64 ఎంపీ కెమెరాతో వస్తున్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే అవుతుంది. ఇది మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ కావడం గమనార్హం. 2019 రెండో అర్ధ భాగంలో ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే షావోమికి ఇక చుక్కలే. శాంసంగ్ నుంచి అగ్రస్థానం లాగేసుకున్న ఈ కంపెనీ మళ్లీ తన పొజిషన్ను శాంసంగ్కు అప్పగించుకోవలసి రావొచ్చు.