మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో పాకిస్థాన్కు చెందిన అభిమానులు సైతం ఉన్నారు.పాకిస్థాన్కు చెందిన షెహజాద్ ఉల్ హాసన్ అనే యువకుడు ధోనికి వీరాభిమాని. వరల్డ్కప్ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు ధరించనున్న గ్రీన్ జెర్సీపై షెహజాద్ ఉల్ హాసన్ తన అభిమాన క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరుని వెనుకవైపు రాయించుకోవడంతో ధోని ట్రేడ్ మార్క్ No 7ని కూడా ప్రింట్ చేయించాడు.ఈ కస్టమ్ జెర్సీని అందుకున్న షెహజాద్ ఉల్ హాసన్ తన ట్విట్టర్లో పంచుకుంటూ ధోనీని కూడా ట్యాగ్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్పై ఓ నెటిజన్ "దేశం మారొచ్చు గాక.. తలాపై ఉన్న ప్రేమ మాత్రం మారదు" అని ట్వీట్ చేశాడు.ఇక, టోర్నీకే హైలెట్గా నిలవనున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 16న ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా జరగనుంది. ఈ వరల్డ్కప్లో టీమిండియా టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. కాగా, 2017లో ఇదే ఇంగ్లాండ్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ విజయం సాధించింది.