ఎప్పటికి వివాదాలతో సహవాసం చేసే రాంగోపాల్ వర్మ ఒక సంచలనమైన ట్వీట్ చేసి మరొకసారి వార్తల్లో నిలిచాడు. కాగా ఈ ట్వీట్ చంద్రబాబు ని ఉద్దేశించి చేసిందే అని నెటిజన్లు గోల పెడుతున్నారు. అయితే గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో చంద్రబాబు నాయుడు, ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ని ఏపీలో రానివ్వకుండా చేసినందుకే వర్మ ఇలాంటి ట్వీట్ చేశారని అందరు అంటున్నారు. కాగా వర్మ ఉద్దేశం కూడా ఇదేనేమో. వర్మ చేసినటువంటి ట్వీట్ లో “ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!! ఎన్ టి ఆర్ నిజమయిన అభిమానులకి , ఇదే నా బహిరంగ ఆహ్వానo..జై జగన్”. ఇక ఈ ట్వీట్ మరిన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి మరి.