లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమికి గల కారణాలపై ఆరా తీశారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఉంటే ఆమె ఓటమిపాలయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కవిత తిరిగి ఎమ్మెల్సీ అయి మంత్రిగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.