ముంబై: గో ఎయిర్ విమాన సంస్థ తాజాగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణానికి కేవలం రూ. 899 నుంచి ఆఫర్ టికెట్లు విక్రయించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 15 నుంచి డిసెంబరు 31 మధ్య విమాన ప్రయాణం కోసం అందుబాటులో ఉండేలా 10 లక్షల టికెట్లను ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు విక్రయిస్తామని తెలిపింది. కనీసం రూ. 2499 లావాదేవికి పేటిఎం వాలెట్ ద్వారా రూ. 500, రూ. 1999 లావాదేవికి మిత్రా యాప్లో 10 శాతం రాయితీ లభిస్తుంది. జూమ్కార్ ద్వారా బుక్ చేసుకుంటే, రూ. 1500 లేదా 20 శాతం రాయితీ లభిస్తుంది. ఫాబ్ గో ఎయిర్ కూపన్ వాడితే 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది.