ప్రధాని మోడీతో వైఎస్ జగన్ భేటీ ఈ రోజే

     Written by : smtv Desk | Sun, May 26, 2019, 09:31 AM

ప్రధాని మోడీతో వైఎస్ జగన్ భేటీ ఈ రోజే

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి.. మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోడీకి శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోడీకి ఆహ్వాన పత్రికను అందించనున్నారు జగన్.

అదేవిధంగా ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. సీఎస్‌.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఢిల్లీకి బయలుదేరారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, నందిగం సురేష్, మార్గాని భరత్‌ తదితర ఎంపీలు కూడా జగన్‌ వెంట ఉన్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements