సిద్ది పేటలో దారుణం .. పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి, బీరు సీసాతో చంపిన తల్లి

     Written by : smtv Desk | Sun, May 26, 2019, 09:35 AM

సిద్ది పేటలో దారుణం .. పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి, బీరు సీసాతో  చంపిన తల్లి

సిద్ధిపేట పట్టణంలోని గణేష్ నగర్లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు వివరాల ప్రకారం, సిద్దపేటలోని గణేశ్‌నగర్‌లో నివాసముంటున్న సరోజ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్(5), హర్షవర్థన్(2)లను అత్యంత పాశవికంగా హత్య చేసింది. చిన్నారులిద్దరికీ నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో ఒళ్లు గగుర్పొడిచేలా దాడి చేసి చంపేసింది. ఇళ్ళ చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

నిందితురాలు అప్పటికే అక్కడ నుంచి వెళ్లిపోయింది. తర్వాత కరీంనగర్ పోలీస్ స్టేషన్‌ లో సరోజ లొంగిపోయింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పరిశీస్తున్నారు. పిల్లల మృతదేహాలను చూసి తండ్రి రోదించడం.. స్థానికులను కంటతడి పెట్టించింది.





Untitled Document
Advertisements