1137.30 కిలోల గంజాయి పట్టివేత

     Written by : smtv Desk | Sun, May 26, 2019, 02:09 PM

1137.30 కిలోల గంజాయి పట్టివేత

విజయవాడలో ఆదివారం భారీగా గంజాయి పట్టుబడింది. ఇసుక లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇసుక లారీలో 1137.30 కిలోల గంజాయిని నర్సీపట్నం ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సందర్భంలో సమాచారం అందుకున్న డీఆర్‌ఐ నిఘా అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements