దేశంలోనే రెండో శక్తివంతమైన నేత అతనే

     Written by : smtv Desk | Sun, May 26, 2019, 06:42 PM

  దేశంలోనే రెండో శక్తివంతమైన నేత అతనే

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద వైసీపీ అధినేత జగన్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని, ప్రధాని తర్వాత దేశంలో అత్యంత పవర్ ఫుల్ నేత అమిత షా అని పేర్కొన్న జగన్ ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. దేశంలోనే రెండో శక్తివంతమైన నేత అని.. ప్రధాని మోదీతో తర్వాత ఆయనే అన్నారు.

అందుకే మొదట ప్రధానితో భేటీ తర్వాత అమిత్ షాతో సమావేశమయ్యానని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై నెంబర్ టూగా ఉన్న వ్యక్తిని కలిశానని చెప్పారు. ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సహకరించాలని అమిత్ షాను కోరానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు జగన్ చెప్పారు. ‘నవరత్నాలు’ ఎలా అమలు చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు జగన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. కేంద్ర సాయం కోరింది అందుకేనని, రాష్ట్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.





Untitled Document
Advertisements