ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ చీఫ్ జగన్ ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కలిశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు జగన్కు రామ్ మాధవ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ రామ్ మాధవ్కు జ్ఞాపిక ఇచ్చి శాలువా కప్పారు. ఇద్దరు నేతలూ తాజా రాజకీయ పరిస్థితులపై ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి ముందు ప్రధాని మోదీని కలిసిన జగన్ ఈ నెల 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఆ తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిశారు. కాగా, జగన్ మోహన్రెడ్డి, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఎవరి ప్రమాణ స్వీకారానికి ఎవరు హాజరవుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరి జగన్ ఎపీకి రానున్నారు. అయితే నిన్న ముందు షెడ్యూల్ ప్రకారం ఆయన నిన్న రాత్రే నేరుగా తిరుపతికి వెళ్లాలి, రాత్రికి ఆయన తిరుపతిలోనే బస చేయనున్నారని ప్లాన్ చేశారు. అయితే అనుకోకుండా మారిన షెడ్యూల్ వలన తిరుపతి వెళతారా లేదా అనేది తేలాల్సి ఉంది.