పాక్ లోని గరునానక్‌ ప్యాలెస్ ధ్వంసం

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 03:32 PM

పాక్ లోని గరునానక్‌ ప్యాలెస్ ధ్వంసం

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న గురునానక్‌ ప్యాలెస్‌ను తాజాగా గుర్తుతెలియని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆ ప్యాలెస్‌లో సిక్కు మత వ్యవస్థాపకుడు గరునానక్‌తో పాటు కొందరు హిందూ రాజుల చిత్రాపటాలు ఉన్నాయి. సుమారు నాలుగు శతాబ్దాల క్రితం ఆ భవంతిని నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ అద్భుత క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు ప్ర‌తి ఏడాది వేలాది మంది సిక్కు ప‌ర్యాట‌కులు అక్క‌డ‌కు వెళ్లేవారు. అయితే గురునాన‌క్ భ‌వ‌నంలో ఉన్న విలువైన కిటికీలు, డోర్ల‌ను అమ్ముకున్న‌ట్లు కూడా తెలుస్తోంది.ప్యాలెస్‌లో సుమారు 16 భారీ సైజున్న రూమ్‌లు ఉన్నాయి.





Untitled Document
Advertisements