అమెజాన్ జైల్లో ఘర్షణ...15 మంది మృతి

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 03:34 PM

అమెజాన్ జైల్లో ఘర్షణ...15 మంది మృతి

సావోపాల్‌: బ్రెజిల్‌ జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘోర ఘర్షణలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లోని అమెజోనాస్‌ రాష్ట్రంలో గల ఓ జైలో ఆదివారం ఉదయం 11 గంటలకు విజిటింగ్‌ అవర్స్‌ సమయంలో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. అది కాస్త ఉద్రిక్తంగా మారింది. ఖైదీలు పదునుగా ఉండే టూత్‌బ్రష్‌లతో పరస్పరం దాడి చేసుకున్నారు. కొందరిని గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.





Untitled Document
Advertisements