ఖాఠ్మాండు: ఆదివారం నేపాల్లో కాఠ్మాండులోని సుకేధర్, ఘట్టెకులో, నాగ్ధుంగా ప్రాంతాల్లో బాంబు పేలుళ్లలు సంభవించాయి. ఈ సంఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే . ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్లకు సమీపంలోని గోడలు సైతం బీటలు వారాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాలను ఆ దేశ ఆర్మీ మోహరించింది. అయితే, ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు.